తనను రక్షించినందుకు ఆద్య పట్ల రామలక్ష్మి కృతజ్ఞతతో ఉంటుంది. మర్నాడు తనకు మొబైల్ ఫోన్ ఛార్జర్, ల్యాప్టాప్ ఇవ్వమని కుటుంబ సభ్యులను అడుగుతుంది ఆద్య. ఆద్య దురుసుగా మాట్లాడడంతో రఘురామ్కి కోపం వస్తుంది.
రామలక్ష్మి, ఆద్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు. ఆద్య రామలక్ష్మిని విడిచిపెట్టి రైల్వే స్టేషన్కి పారిపోతుంది. ఆద్య నగరం విడిచి వెళ్లాలని ప్లాన్ చేసిందని జానకి గ్రహిస్తుంది.